Share News

Waterfalls జలపాతాల వద్ద వసతుల కల్పన

ABN , Publish Date - Nov 19 , 2025 | 12:08 AM

Providing Amenities at Waterfalls మండలంలో జలపాతాల వద్ద వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని, పర్యాటకంగా అభివృద్ధి చేయాలని డీఆర్‌డీఏ పీడీ ఎం.సుధారాణి ఆదే శించారు. మంగళవారం నీలంవలస సమీపంలోని జలపాతాన్ని సందర్శించారు.

 Waterfalls జలపాతాల వద్ద వసతుల కల్పన
నీలంవలస జలపాతం వద్ద డీఆర్‌డీఏ పీడీ సుధారాణి తదితరులు

పాచిపెంట, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): మండలంలో జలపాతాల వద్ద వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని, పర్యాటకంగా అభివృద్ధి చేయాలని డీఆర్‌డీఏ పీడీ ఎం.సుధారాణి ఆదే శించారు. మంగళవారం నీలంవలస సమీపంలోని జలపాతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పర్యాటకులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసు కున్నారు. మహిళా లబ్ధిదారులకు రుణం మంజూరు చేసి ఈ ప్రాంతంలో పలు దుకాణాలు ఏర్పాటు చేయాలని వెలుగు ఏపీఎం రెడ్డి శ్రీరాములుకు సూచించారు. గ్రామస్థులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి రహదారి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రాన్ని తీర్చిదిద్దాలని ఉపాధి, వెలుగు అధికారులను ఆదేశించారు. ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు. ఆమె వెంట ఎంపీడీవో పాత్రో, ఏజీఎం కామరాజు, డీఆర్‌డీఏ డీపీఎంలు తదితరులు ఉన్నారు.

Updated Date - Nov 19 , 2025 | 12:08 AM