సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్
ABN , Publish Date - May 10 , 2025 | 12:08 AM
ప్రజా సమస్య ల పరిష్కారానికే ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నామని ప్రభు త్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు.

క్యాంపు కార్యాలయాల్లో వినతిపత్రాలు స్వీకరించిన ఎమ్మెల్యేలు
గుమ్మలక్ష్మీపురం, మే 9 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్య ల పరిష్కారానికే ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నామని ప్రభు త్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు. గుమ్మలక్ష్మీపురంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యే పాల్గొని, ప్రజల నుంచి వినతులు స్వీకరించా రు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త కడ్రక మల్లేశ్వరరావు, నాయకులు మరడాన తవిటినాయుడు, రామారావు, చిన్న, సుబ్బ లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
పార్వతీపురం రూరల్: ప్రజా సమస్యలను పరిష్క రించేందుకే ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఎమ్మెల్యే విజయచంద్ర చెప్పారు. మండలంలోని నర్సిపు రం గ్రామంలో ఉన్న తన క్యాంప్ కార్యాలయంలో శుక్రవా రం ఆయన ప్రజాదర్బార్ నిర్వహించారు. పలువురి నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో ఉన్న గ్రామాల్లో ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ నిధులతో సీసీ రోడ్లు, కాలువలు, బీటీ రోడ్లు తదితర అభివృద్ధి పనులు చేపడుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
రహదారుల నిర్మాణానికి కృషి
బొబ్బిలి రూరల్, మే 9 (ఆంధ్రజ్యోతి): నియోజక వర్గంలో రహదారుల నిర్మాణానికి నిధులు మంజూర య్యేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే బేబీనాయన అన్నారు. బొబ్బిలిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన ప్రజాదర్బార్ నిర్వహించారు. పలువురి నుంచి వినతులు స్వీకరించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని ఆదేశాలి చ్చారు. అలాగే నియోజకవర్గ పరిధిలోని రోడ్లు అభివృద్ధికి గతంలో మంజూరైన నిధులపై ఆర్అండ్బీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పినపెంకి, ఆకులకట్ట గ్రామాల మధ్య రోడ్డు నిర్మాణానికి రూ.2.90 కోట్లు మంజూరైనట్టు అధికారులు ఎమ్మెల్యేకు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అమరావతి వెళ్లినప్పుడు ఆర్అండ్బీ శాఖ మంత్రిని కలిసి, వీలైనంత త్వరగా నిధులు విడుదలయ్యే ప్రయత్నం చేస్తానని తెలిపారు.