Share News

కారు ఢీకొని ఒకరు మృతి

ABN , Publish Date - Jul 18 , 2025 | 12:07 AM

పాలకొండ-హడ్డుబంగి ప్రధాన రహదారిపై కంబగూడ సమీపంలో గురువారం కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో హడ్డుబంగి ఎంపీటీసీ సభ్యురాలు సవర సరోజిని భర్త సవర తవిటిరాజు(48) మృతి చెందారు.

కారు ఢీకొని ఒకరు మృతి

సీతంపేట రూరల్‌, జూలై17 (ఆంధ్రజ్యోతి): పాలకొండ-హడ్డుబంగి ప్రధాన రహదారిపై కంబగూడ సమీపంలో గురువారం కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో హడ్డుబంగి ఎంపీటీసీ సభ్యురాలు సవర సరోజిని భర్త సవర తవిటిరాజు(48) మృతి చెందారు. పోలీసులు అందిం చిన వివరాల మేరకు.. మృతుడి స్వగ్రామమైన చీడిమానుగూడ నుండి సీతంపేటకు ద్విచక్ర వాహనంపై వస్తున్న తవిటిరాజును సీతంపేట నుం చి కొత్తూరు వైపు వెళ్తున్న కారు కంబగూడ మలుపు వద్ద బలంగా ఢీకొ ట్టింది. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన తవిటిరాజును స్థానికులు 108 వాహనంలో సీతంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీ లించి అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. మృతునికి భార్య, ఇద్ద రు పిల్లలు ఉన్నారు. ఎస్‌ఐ అమ్మనరావు కేసు నమోదు చేశారు.

Updated Date - Jul 18 , 2025 | 12:08 AM