Share News

కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి

ABN , Publish Date - Aug 19 , 2025 | 12:16 AM

మునిసిపాలిటీలో ఆప్కాస్‌ విధానంలో పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తూ ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాల్లో ఉన్న ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని సీఐటీయూ నాయకులు డిమాండ్‌ చేశారు.

 కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి
ధర్నా చేస్తున్న సీపీఎం నాయకులు

కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి

పార్వతీపురంటౌన్‌, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి):

మునిసిపాలిటీలో ఆప్కాస్‌ విధానంలో పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తూ ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాల్లో ఉన్న ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని సీఐటీయూ నాయకులు డిమాండ్‌ చేశారు. కలెక్టరేట్‌ వద్ద మృతి చెందిన కుటుంబాలకు న్యాయం చేయాలని సీఐటీయూ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జీవో- 25 ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఆప్కాస్‌లో పనిచేస్తూ మృతి చెందిన కార్మిక కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇచ్కారని తెలిపారు. పార్వతీపురం మునిసిపాలిటీలో పనిచేస్తూ మృతి చెందిన వారి కుటుంబాలకు కూడా ఉద్యోగం ఇవ్వాలని కోరారు.

Updated Date - Aug 19 , 2025 | 12:16 AM