మెంటాడను విజయనగరంలో కొనసాగించాలి
ABN , Publish Date - Nov 05 , 2025 | 12:02 AM
మెంటాడ మండలాన్ని విజయనగరం డివిజన్లో కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని మెంటాడ కూటమి నాయకులు కోరారు. మంగళవారం కలెక్టరేట్ గాంధీ విగ్రహం వద్ద కూటమి నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించి డీఆర్వో శ్రీనివాసమూర్తికి వినతిపత్రం అందజేశారు.
విజయనగరం కలెక్టరేట్, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): మెంటాడ మండలాన్ని విజయనగరం డివిజన్లో కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని మెంటాడ కూటమి నాయకులు కోరారు. మంగళవారం కలెక్టరేట్ గాంధీ విగ్రహం వద్ద కూటమి నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించి డీఆర్వో శ్రీనివాసమూర్తికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలోని టీడీపీ నాయకులు గెద్ద అన్నవరం, రాయపల్లి రవి, గొర్లి ముసలి నాయుడు, జనసేన నాయకులు రాజశేఖర్, బీజేపీ నాయకులు ఎం.అప్పలనాయుడు పాల్గొన్నారు.