Mega Job Fair 3న పార్వతీపురంలో మెగా జాబ్మేళా
ABN , Publish Date - Nov 29 , 2025 | 11:46 PM
Mega Job Fair on 3rd in Parvathipuram జిల్లాకేంద్రం పార్వతీపురంలో వచ్చేనెల 3న మెగా జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధి కారి కె.సాయి కృష్ణ చైతన్య శనివారం ఒక ప్రటనలో తెలిపారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లమో, ఏదైనా డిగ్రీ పాసైన వారు అర్హులని పేర్కొన్నారు.
బెలగాం, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): జిల్లాకేంద్రం పార్వతీపురంలో వచ్చేనెల 3న మెగా జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధి కారి కె.సాయి కృష్ణ చైతన్య శనివారం ఒక ప్రటనలో తెలిపారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లమో, ఏదైనా డిగ్రీ పాసైన వారు అర్హులని పేర్కొన్నారు. 18-30 సం వత్సరాల లోపు వారు.. గాయత్రి డిగ్రీ కళాశాలలో జరిగే జాబ్మేళాలో పాల్గొ నొచ్చని వెల్లడించారు. మొత్తంగా 23 కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారన్నారు. ఇతర వివరాల కోసం 91772 97528, 89788 78557 నెంబర్లను సంప్రదించాలని కోరారు.