వైద్య సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండాలి
ABN , Publish Date - Jun 01 , 2025 | 12:03 AM
వైద్యులు, సిబ్బంది నిత్యం అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలను అందించా లని ప్రభుత్వ విప్, కురపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ఆదేశించారు.
గుమ్మలక్ష్మీపురం, మే 31 (ఆంధ్రజ్యోతి): వైద్యులు, సిబ్బంది నిత్యం అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలను అందించా లని ప్రభుత్వ విప్, కురపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ఆదేశించారు. తాడికొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె శనివారం ఆకస్మికంగా సందర్శించారు. రోగులతో మాట్లాడి, అందుతు న్న వైద్య సేవలపై ఆరా తీశారు. మందుల స్టాక్ రిజిష్టర్ను తనిఖీ చేశారు. ఆసుపత్రిలో కావాల్సిన మందులను ముందుగానే ఇండెంట్ పెట్టుకోవాలని సిబ్బందికి సూచించారు. వర్షాకా లంలో జ్వరాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున వైద్యులు, సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండాలన్నా రు. రిఫరెన్స్లు తగ్గించి ఇదే ఆసుపత్రిలో వీలైనంత వరకు చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. ఎమ్మెల్యే వెంట నియోజకవర్గ ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి అడ్డాకుల నరేష్, లుంబేసు, మాజీ సర్పంచ్ తోయక జమ్మయ్య తదితరులు ఉన్నారు.