Share News

బొబ్బిలి చేరుకున్న ‘ప్రేమ ప్రవాహిని’

ABN , Publish Date - May 10 , 2025 | 12:10 AM

సత్యసాయిబా బా శత జయంతి ఉత్సవాల్లో భాగంగా పుట్టపర్తి నుంచి ప్రారంభమైన సత్యసాయి ప్రేమ ప్రవాహిని రథం శుక్ర వారం బొబ్బిలి చేరుకుంది.

బొబ్బిలి చేరుకున్న ‘ప్రేమ ప్రవాహిని’
రథానికి హారతి ఇస్తున్న డీఎస్పీ భవ్యరెడ్డి

బొబ్బిలి/ రూరల్‌, మే 9 (ఆంధ్రజ్యోతి): సత్యసాయిబా బా శత జయంతి ఉత్సవాల్లో భాగంగా పుట్టపర్తి నుంచి ప్రారంభమైన సత్యసాయి ప్రేమ ప్రవాహిని రథం శుక్ర వారం బొబ్బిలి చేరుకుంది. మండలంలోని పురిడి గ్రామం మీదుగా బొబ్బిలి చేరుకుంది. పురిడిలో బాలికలు కోలా టంతో ఘన స్వాగతం పలికారు. బొబ్బిలి చేరుకున్న రథానికి సత్యసాయి యువత బైక్‌ ర్యాలీతో ఆహ్వానిం చారు. డీఎస్పీ భవ్యరెడ్డి కొబ్బిరికాయ కొట్టి రథ యాత్రకు స్వాగతం పలికారు. చిన్నారులు కోలాటం ఆడారు. ఈ రథ యాత్రలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Updated Date - May 10 , 2025 | 12:10 AM