బార్లకు లాటరీ ప్రక్రియ పూర్తి
ABN , Publish Date - Sep 19 , 2025 | 12:00 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన బార్ పాలసీ 2025-28 ప్రక్రియలో భాగంగా జిల్లాలో ఖాళీగా ఉన్న నాలుగు బార్లకు కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం స్థానిక కలెక్టరేట్ వద్ద లాటరీ తీశారు.
విజయనగరం క్రైం, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన బార్ పాలసీ 2025-28 ప్రక్రియలో భాగంగా జిల్లాలో ఖాళీగా ఉన్న నాలుగు బార్లకు కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం స్థానిక కలెక్టరేట్ వద్ద లాటరీ తీశారు. మొత్తం 16 దరఖాస్తులకు 81 లక్షల 6 వేల రూపా యలు ప్రభుత్వానికి ఆదాయం లభించినట్టు జిల్లా ఎక్సైజ్ ప్రొహిబిషన్ సూపరిడెంట్ంట్ బమ్మిడి శ్రీనాధు డు తెలిపారు. ఈ ప్రక్రియలో కలెక్టర్తో పాటు జేసీ సేతుమాధవన్, ఎక్సైజ్ డీసీ శ్రీనివాసచౌదరి, ఎక్సైజ్ అధికారులు, బార్లు యాజమానులు పాల్గొన్నారు.