Share News

Job Fair 21న జాబ్‌మేళా

ABN , Publish Date - Mar 17 , 2025 | 11:50 PM

Job Fair on 21st నిరుద్యోగ యువత కోసం ఈ నెల 21న సీతంపేట వైటీసీలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.

Job Fair  21న జాబ్‌మేళా

సీతంపేట రూరల్‌,మార్చి 17(ఆంధ్రజ్యోతి):నిరుద్యోగ యువత కోసం ఈ నెల 21న సీతంపేట వైటీసీలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. గ్రాడ్యుయేట్‌ ఇంజనీర్‌, ప్రొడక్షన్‌, మిషన్‌ ఆపరేటర్‌ ట్రైనీ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ జాబ్‌మేళాలో ఆరు కంపెనీల ప్రతినిధులు పాల్గొని 250 ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపి చేయనున్నట్లు తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు రూ.16వేల నుంచి రూ.20వేల వరకు వేతనం చెల్లిస్తారన్నారు. టెన్త్‌, ఇంటర్‌, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ, బీటెక్‌ పూర్తిచేసిన 18నుంచి 35 ఏళ్లలోపు యువతీ, యువకులు అర్హులని వెల్లడించారు. ఇతర వివరాల కోసం 70320 60773, 91546 62567 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.

Updated Date - Mar 17 , 2025 | 11:50 PM