జిందాల్ నిర్వాసితుల నిరసన
ABN , Publish Date - Aug 18 , 2025 | 12:22 AM
మండలంలోని బొడ్డవర గ్రామంలో గత 57 రోజులుగా జిందాల్ నిర్వాసితులు నిరసన చేపడుతున్నారు.
ఎస్.కోట రూరల్, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): మండలంలోని బొడ్డవర గ్రామంలో గత 57 రోజులుగా జిందాల్ నిర్వాసితులు నిరసన చేపడుతున్నారు. ఆదివారం జోరువానలో జిల్లా రైతు సంఘ ఉపాధ్యక్షుడు చల్లా జగన్ ఆధ్వర్యంలో నోటికి నల్లగుడ్డలు కట్టుకుని నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ జిందాల్కు ప్రభుత్వం చేసిన రిజిస్ట్రేషన్లు వెంటనే రద్దు చేసి, రైతుల భూములు వారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు.