మానవ హక్కుల కమిషన్కు జిందాల్ నిర్వాసితుల లేఖలు
ABN , Publish Date - Jul 10 , 2025 | 12:15 AM
తమకు జిందాల్ కంపెనీ నుంచి రావాల్సిన హక్కులను కల్పించాలని కోరుతూ నిర్వాసితులు బుధవారం జాతీయ మానవ హక్కుల కమిషన్కు సామూహికంగా లేఖలు రాశారు.
శృంగవరపుకోట రూరల్, జూలై 9(ఆంధ్రజ్యోతి): తమకు జిందాల్ కంపెనీ నుంచి రావాల్సిన హక్కులను కల్పించాలని కోరుతూ నిర్వాసితులు బుధవారం జాతీయ మానవ హక్కుల కమిషన్కు సామూహికంగా లేఖలు రాశారు. ఈ విషయమై జిందాల్ నిర్వాసితులు మట్లాడుతూ ఇప్పటి వరకు తమ గోడును మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ దృష్టిలో పెట్టినా ఫలితం లేకపోయిందన్నారు. అందుకే మానవ హక్కుల కమిషన్కు లేఖలు రాస్తున్నట్టు తెలిపారు.