సీపీఎం నాయకుల వినూత్న నిర సన
ABN , Publish Date - May 24 , 2025 | 12:17 AM
కొమరాడ మండలం కోటిపాం వంతెనపై శుక్రవా రం సీపీఎం నాయ కులు ఆ సంఘం జిల్లా కార్యవర్గ సభ్యుడు కొల్లి సాంబమూర్తి ఆధ్వర్యంలో వినూ త్న నిరసన చేపట్టారు.
జియ్యమ్మవలస, మే 23 (ఆంధ్రజ్యో తి): కొమరాడ మండలం కోటిపాం వంతెనపై శుక్రవా రం సీపీఎం నాయ కులు ఆ సంఘం జిల్లా కార్యవర్గ సభ్యుడు కొల్లి సాంబమూర్తి ఆధ్వర్యంలో వినూ త్న నిరసన చేపట్టారు. బ్రిడ్జిపై ఉన్న గోతిలో స్నానం చేసి నిరసన తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడు తూ అంతర్ రాష్ట్ర రహదారి ఉన్న కొమరాడ మండలంలో రోడ్డు అత్యంత దారుణంగా ఉంద ని, ఎక్కడ చూసినా గోతులతో దర్శనమిస్తోంద ని ఆందోళన వ్యక్తం చేశారు. జూన్ 1వ తేదీలో గా బ్రిడ్జిపై ఉన్న భారీ గోతులను పూడ్చాలని, దీంతో పాటు రోడ్డు పూర్తిగా మరమ్మతులు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే ఈ బ్రిడ్జి వద్దే తీవ్ర ఉద్యమం చేస్తామని, ఏది జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించా లన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సీపీఎం నాయకులు పాల్గొన్నారు.