Earth... ఆయన భూమిలో ఉందని..
ABN , Publish Date - Apr 07 , 2025 | 11:25 PM
He is on Earth... కొమరాడ మండలం డంగభద్ర నుంచి తమ్మన్నదొరవలస గ్రామాల మధ్యలో ఉన్న బీటీ రహదారిని ఓ వ్యక్తి అడ్డంగా తవ్వేశాడు. దీనిపై గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గ్రామస్థుల రాకపోకలకు ఇబ్బందులు
కొమరాడ, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): కొమరాడ మండలం డంగభద్ర నుంచి తమ్మన్నదొరవలస గ్రామాల మధ్యలో ఉన్న బీటీ రహదారిని ఓ వ్యక్తి అడ్డంగా తవ్వేశాడు. దీనిపై గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఉపాధి హామీ పథకం ద్వారా రూ. 1.80 కోట్లతో పార్వతీపురం ఐటీడీఏ ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఆ రహదారిని నిర్మించారు. అయితే తన జిరాయితీ భూమిలో రోడ్డు వేశారంటూ ఓ వ్యక్తి అభ్యంతరం తెలిపాడు. రహదారిని అడ్డంగా తవ్వేశాడు. దీంతో పలు గ్రామాల రాకపోలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు కొమరాడ పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండా తన జిరాయితీ భూమిలో రహదారి నిర్మించడం ఏమిటని తవ్విన వ్యక్తి ప్రశ్నించాడు. తహసీల్దార్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.