temple trust board: దేవాలయ ట్రస్ట్బోర్డుల నియామకాలకు గ్రీన్సిగ్నల్
ABN , Publish Date - May 09 , 2025 | 11:43 PM
temple trust board:దేవాలయాల ట్రస్ట్బోర్డుల నియామకాలకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.

- జిల్లాలో 18 ఆలయాలకు నోటిఫికేషన్ జారీ
రాజాం రూరల్, మే 9 (ఆంధ్రజ్యోతి): దేవాలయాల ట్రస్ట్బోర్డుల నియామకాలకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు జిల్లాలో 18 ఆలయాల ట్రస్ట్బోర్డుల నియామకాలకు వీలుగా ఎండోమెంట్ కమిషనర్ కె.రామచంద్రమోహన్ నోటిఫికేషన్ జారీ చేశారు. సభ్యుల అర్హతలు, ఇతరత్రా వివరాలను నోటిఫికేషన్లో పొందుపరిచారు. ఈ సమాచారం ప్రజలకు తెలియజేసే విధంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోని నోటీసు బోర్డుల్లో ఆలయాల ఈవోలు నోటిఫికేషన్ ప్రతులను అతికిస్తున్నారు. రాజాంలోని నవదుర్గ అమ్మవారి ఆలయానికి వానపల్లి నరిశింగరావు, గుళ్ల సీతారాంపురంలోని సీతారామస్వామి ఆలయానికి బొబ్బిలి సంస్థానాధీశులు వంశపారంపర్య ధర్మకర్తలుగా కొనసాగుతున్నారు. ఈ ఆలయాలకు వీరిద్దరే చైర్మన్లగా కొనసాగుతారు. కేవలం సభ్యుల నియామకాలు మాత్రమే చేపడతారు. మిగిలిన 16 ఆలయాలకు పూర్తిస్థాయి ట్రస్ట్బోర్డు నియామకాలు జరుపుతారు.
ఆ దేవాలయాలివే..
బొబ్బిలి వేణుగోపాలస్వామి ఆలయం, ఆంజనేయస్వామి ఆలయం, పాత బొబ్బిలి ఆంజనేయ, చీపురుపల్లి నీలకంఠేశ్వర, పోలిపల్లి పైడితల్లి, కుమిలి గణపతి, శ్రీరాంపురం సీతారామస్వామి, సంతపేట జగన్నాథ, విజయనగరం శ్రీమన్నార్ రాజగోపాల, కొత్త అగ్రహారం సీతారామ, బాలాజీనగర్ వెంకటేశ్వర, అయ్యకోనేరుగట్టు పెద్దాంజనేయ, విజయనగరం ఉమారామలింగేశ్వర, సంగాం సంగమేశ్వర, డోలపేట ఉమామహేశ్వర, లక్ష్మీనారాయణ స్వామి, రాజాం నవదుర్గ, గుళ్ల సీతారాంపురం సీతారామస్వామి ఆలయం.