Share News

మేలు చేసే పనులపై శ్రద్ధవహించాలి

ABN , Publish Date - Nov 15 , 2025 | 11:36 PM

ప్రభుత్వం అప్పగించిన కార్యక్రమాలను మొక్కుబడిగా నిర్వహించవద్దని, వ్యక్తులు, సమాజానికి మేలు చేసే పనులపై అధికారులు శ్రద్ధ వహించాలని డివిజనల్‌ అభివృద్ధి అధికారి హేమసుందర్‌ అన్నారు.

  మేలు చేసే పనులపై శ్రద్ధవహించాలి
చేతుల శుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న డీఎల్‌డీవో

డీఎల్‌డీవో హేమసుందర్‌

చీపురుపల్లి, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి):ప్రభుత్వం అప్పగించిన కార్యక్రమాలను మొక్కుబడిగా నిర్వహించవద్దని, వ్యక్తులు, సమాజానికి మేలు చేసే పనులపై అధికారులు శ్రద్ధ వహించాలని డివిజనల్‌ అభివృద్ధి అధికారి హేమసుందర్‌ అన్నారు. శనివారం ఆయన మెట్టపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పరిశుభ్రతపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. చేతులు శుభ్రం చేసే విధానంపై వారికి అవగాహన కల్పించారు. మధ్యాహ్న భోజనం తయారీని పరిశీలించారు. వీధుల్లో చెత్త వేయవద్దని, ఈ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట డిప్యుటీ ఎంపీడీవో అప్పలనాయుడు, సిబ్బంది ఉన్నారు. రామలింగపురం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో హెచ్‌ఎం గొర్లె పద్మావతి, బీజేపీ అధ్యక్షుడు ఇప్పిలి నీలకంఠం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 15 , 2025 | 11:36 PM