Share News

Nagavali నాగావళిలో పెరిగిన వరద

ABN , Publish Date - Sep 12 , 2025 | 11:59 PM

Floods Rise in Nagavali తోటపల్లి ప్రాజెక్టు పరిధిలోని నాగావళిలో శుక్రవారం వరద ప్రవాహం పెరిగింది. ఒడిశాతో పాటు జిల్లాలోనూ వర్షాలు కురుస్తుండడంతో 6500 క్యూసెక్కులు నదిలో చేరింది.

  Nagavali  నాగావళిలో పెరిగిన వరద
స్పిల్‌వే గేట్లు నుంచి దిగువకు నీటిని విడుదల చేసిన దృశ్యం

గరుగుబిల్లి, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): తోటపల్లి ప్రాజెక్టు పరిధిలోని నాగావళిలో శుక్రవారం వరద ప్రవాహం పెరిగింది. ఒడిశాతో పాటు జిల్లాలోనూ వర్షాలు కురుస్తుండడంతో 6500 క్యూసెక్కులు నదిలో చేరింది. దీంతో అధికారులు అప్రమత్తమై స్పిల్‌వే గేట్ల నుంచి 5 వేల క్యూసెక్కులను దిగువ ప్రాంతాలకు విడుదల చేశారు. సాగునీటి అవసరాల కోసం ప్రధాన కాలువల నుంచి 1,320 క్యూసెక్కులను సరఫరా చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 105 మీటర్లకు గాను 104.51 మీటర్ల మేర నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.



Updated Date - Sep 12 , 2025 | 11:59 PM