Nominated System నామినేటెడ్ పద్ధతికి స్వస్తి
ABN , Publish Date - Sep 30 , 2025 | 11:22 PM
Farewell to the Nominated System ఉపాధి హామీ పథకంలో కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. దీనిపై సంబంధిత అధికారులకు ఇప్పటికే ఆదేశాలు అందాయి. ఇకపై ఉపాఽధిలో చేపట్టబోయే అభివృద్ధి పనులకు టెండర్లు నిర్వహించనున్నారు. నామినేటెడ్ పద్ధతికి స్వస్తి చెప్పనున్నారు.
అభివృద్ధి పనులకు ఇకపై టెండర్లు
పార్వతీపురం, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకంలో కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. దీనిపై సంబంధిత అధికారులకు ఇప్పటికే ఆదేశాలు అందాయి. ఇకపై ఉపాఽధిలో చేపట్టబోయే అభివృద్ధి పనులకు టెండర్లు నిర్వహించనున్నారు. నామినేటెడ్ పద్ధతికి స్వస్తి చెప్పనున్నారు. మెటీరియల్ కాంపోనెంట్తో చేపట్టే ఏ పనినైనా ఇకపై టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లను ఖరారు చేస్తారు. కాగా గతంలో మెటీరియల్ కాంపోనెంట్ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులను నామినేటెడ్ పద్ధతిలోనే కేటాయించేవారు. సర్పంచ్ ఉన్నప్పటికీ అధికారంలో ఉన్న రాజకీయ పార్టీల నాయకులు లేదా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు ఆధ్వర్యంలోనే ఈ పనులు జరిగేవి. అయితే తాజాగా నిబంధనలు మారడంతో ప్రస్తుత కూటమి శ్రేణులు, ద్వితీయ శ్రేణి నాయకులు తలలు పట్టుకుంటున్నారు. ఇకపై వారు టెండర్ విధానంలో పాల్గొని అభివృద్ధి పనులను చేపట్టాల్సి ఉంది. దీనిపై డ్వామా పీడీ రామచంద్రరావును వివరణ కోరగా.. ఇకపై నిబంధనల మేరకు టెండర్లు నిర్వహించి ఉపాధి అభివృద్ధి పనులు కేటాయిస్తామని తెలిపారు.