ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలి: ఎంపీ
ABN , Publish Date - Jun 08 , 2025 | 11:57 PM
ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కోరారు.ఆదివారం రణస్థలంలో మొక్కలు పంపిణీ కార్యక్రమం చేశారు.
రణస్థలం, జూన్ 8(ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కోరారు.ఆదివారం రణస్థలంలో మొక్కలు పంపిణీ కార్యక్రమం చేశారు.ఈసందర్భంగా మాట్లాడుతూ శ్రీనిఖిల నాయు డు కలిశెట్టి చారిటిబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పదివేలు మొక్కలు పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. కలిశెట్టి ప్రభానాయుడు కోష్టలో మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు డీజీఎం ఆనందరావు, దెయ్యం వసంతరావు, దెయ్యం శ్రీనివాసరావు పాల్గొన్నారు.
: