Share News

‘ఉపాధి’ సక్రమంగా నిర్వహించాలి

ABN , Publish Date - May 09 , 2025 | 12:03 AM

ఉపాధి హామీపఽథకం పనులు సక్రమంగా నిర్వహించాలని ఎమ్మెల్యే లోకం నాగమాధవి కోరారు. గురువారం మండలం లోని ముంజేరు సమీ పంలో గల జనసేన పార్టీ కార్యాలయంలో ఉపాధి హామీ పథకం ఏపీవోలు,ఈసీలు, టీఏలతో సమావేశం నిర్వహిం చారు.

 ‘ఉపాధి’ సక్రమంగా నిర్వహించాలి
మాట్లాడుతున్న నాగమాధవి:

భోగాపురం, మే 8(ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీపఽథకం పనులు సక్రమంగా నిర్వహించాలని ఎమ్మెల్యే లోకం నాగమాధవి కోరారు. గురువారం మండలం లోని ముంజేరు సమీ పంలో గల జనసేన పార్టీ కార్యాలయంలో ఉపాధి హామీ పథకం ఏపీవోలు,ఈసీలు, టీఏలతో సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా గతనెలలో నిర్వహించిన పనుల గురించి అడిగి తెలుసుకొన్నారు. నీటి వనరులను భద్రప రచడం,నీటితొట్టెలు పునరుద్దరించడం ద్వారా నీటి నిల్వ లు పెంచుకోవచ్చని సూచించారు.సముద్రతీరంలో తాటి మొక్కలునాటడంతో పర్యావరణం కాపాడడం తోపాటు ఇసుక కొట్టుకుపోకుండా ఉంటుందని తెలిపారు.

Updated Date - May 09 , 2025 | 12:03 AM