జంఝావతి సాధన సమితి ఎన్నిక
ABN , Publish Date - May 22 , 2025 | 12:17 AM
దశాబ్దాలుగా రైతులను ఊరిస్తున్న జంఝావతి ప్రాజెక్టు పూర్తి చేసి ఆయకట్టుకు సాగునీరు అందించాలని జంఝావతి సాధన సమితి డిమాండ్ చేసింది. బుధవారం పార్వతీపురంలో ఏపీ ఎన్జీవో హోంలో ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మరిశర్ల కృష్ణమూర్తి నాయుడు ఆధ్వర్యంలో జంఝావతి సాధన సమితిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
బెలగాం, మే 21 (ఆంధ్రజ్యోతి): దశాబ్దాలుగా రైతులను ఊరిస్తున్న జంఝావతి ప్రాజెక్టు పూర్తి చేసి ఆయకట్టుకు సాగునీరు అందించాలని జంఝావతి సాధన సమితి డిమాండ్ చేసింది. బుధవారం పార్వతీపురంలో ఏపీ ఎన్జీవో హోంలో ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మరిశర్ల కృష్ణమూర్తి నాయుడు ఆధ్వర్యంలో జంఝావతి సాధన సమితిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా డి.పారినాయుడు, అధ్యక్షులుగా చుక్క భాస్కరరావు, ప్రధాన కార్యదర్శిగా పల్లి రాజగోపాల నాయుడు, ఉపాధ్యక్షులుగా ఈర్ల సంజీవ నాయుడు, కొల్లి సంహాచలం, వర్కింగ్ ప్రెసెడెంట్ లుగా మంచుపల్లి శ్రీరాములు, సవరపు రామారావు, రంజిత్ కుమార్, ఈవి నాయుడు, కార్యదర్శులను, ప్రచార కమిటీ కన్వీనర్లను ఎన్నుకున్నారు. జంఝావతి ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు సాగు నీరిందించే వరకు పోరాడతామని సాధన కమిటీ స్పష్టంచేసింది.