‘తల్లికి వందనం’ తో విద్యాభివృద్ధి
ABN , Publish Date - Jun 17 , 2025 | 11:56 PM
ww
భోగాపురం, జూన్17(ఆంధ్రజ్యోతి): తల్లికి వందనం పఽథకం వల్ల పేద కుటుం బాల్లో ఆర్థిక ప్రమాణాలు మెరుగుపడడంతోపాటు ప్రతి తల్లి తమ పిల్లలను పాఠశాలకు పంపింస్తుందని దీంతో రాష్ట్రం అన్నివిదాలా విద్యాభివృద్ధి జరుగుతుం ద మార్క్ఫెడ్ చైర్మన్, నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి కర్రోతు బంగా ర్రాజు తెలిపారు. మంగళవారం మండలంలెని పోలిపల్లి సమీపంలో విలేకరులతో మాట్లాడారు. విద్యను ప్రోత్సహించడమే ఈపథకం ఉద్దేశమన్నారు. ఈపథకం ద్వారా అర్హతగల తల్లికి ప్రతీ ఏడాది బ్యాంకు ఖాతాకు రూ.13వేలు జమ చేయగా, మరుగు దొడ్లు, పాఠశాల నిర్వహణకు రూ.రెండు వేలు కేటాయించినట్లు తెలిపారు. కార్యకమ్రంలో టీడీపీమండలాధ్యక్షులు కర్రోతు సత్యనారాయణ,నాయకులు పి.అప్పలనారాయణ, ఎ.జగన్మోహన్రావు పాల్గొన్నారు.