డ్రోన్ టెక్నాలజీ రైతులకు వరం
ABN , Publish Date - Jul 26 , 2025 | 12:01 AM
డ్రోన్ టెక్నాలజీ రైతులకు వరం లాంటిదని ఎమ్మెల్యే లలితకుమారి అన్నారు.
లక్కవరపుకోట, జూలై 25(ఆంధ్రజ్యోతి): డ్రోన్ టెక్నాలజీ రైతులకు వరం లాంటిదని ఎమ్మెల్యే లలితకుమారి అన్నారు. రంగారా యపురం గ్రామంలో వ్యవసాయశాఖ అం దించిన డ్రోన్ను ఆమె శుక్రవారం ప్రారం భించారు. డ్రోన్ వినియోగంతో రైతులకు సమయం, ఖర్చు ఆదా అవుతాయని తెలిపారు. అంతకముందు సంతపేట గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ జడ్పీటీసీ కరెడ్ల ఈశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ చొక్కాకుల మల్లునాయుడు, కొల్ల భూపాల్నాయుడు, ఏడీ భానులత, ఏవో వి.హరికృష్ణ పాల్గొన్నారు.
వ్యవసాయంలో డ్రోన్లు వినియోగించండి
కొత్తవలస, జూలై 25 (ఆంధ్రజ్యోతి): రైతులు వ్యవసాయంలో డ్రోన్లను వినియోగించుకోవాలని విజయనగరం రైతు శిక్షణా కేంద్రం ఏడీఏ భారతి సూ చించారు. శుక్రవారం సంతపాలెం రైతుసేవా కేంద్రంలో ఏవో కేవీ రాంప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొని, డ్రోన్ల వినియోగంపై అవగా హన కల్పించారు. వ్యవసాయం సిబ్బంది పాల్గొన్నారు.