మా పాఠశాలలను విలీనం చేయొద్దు
ABN , Publish Date - Jun 24 , 2025 | 12:07 AM
ఆద ర్శ పాఠశాలలో తమ పాఠశాల లను విలీనం చేయవద్దని బలిజిపేట మండలం పెదపెం కి ఎంపీపీ పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు సోమవారం స్థాని క కలెక్టరేట్ వద్దనిరసన తెలిపారు.
బెలగాం/ పార్వతీపురం, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): ఆద ర్శ పాఠశాలలో తమ పాఠశాల లను విలీనం చేయవద్దని బలిజిపేట మండలం పెదపెం కి ఎంపీపీ పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు సోమవారం స్థాని క కలెక్టరేట్ వద్దనిరసన తెలిపారు. 3, 4, 5 తరగతులను వేరే పాఠశాలలో విలీనం చేయడం దారుణమన్నారు.
గరుగుబిల్లి: హిక్కింవలస పాఠశాలను మోడల్ ప్రైమరీ పాఠశాలగా గుర్తించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. తమ పాఠశాలలోని 3, 4, 5 తరగతులను జడ్పీ పాఠశాలలో విలీనం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హిక్కింవ లసలో 1 నుంచి 5వ తరగతులు కొనసాగించడంతో పాటు మోడల్ ప్రైమరీ పాఠశాలగా గుర్తించాలన్నారు.