Share News

Pulse Polio 21న జిల్లా వ్యాప్తంగా పల్స్‌పోలియో

ABN , Publish Date - Dec 18 , 2025 | 11:30 PM

District-wide Pulse Polio Drive on the 21st జిల్లా వ్యాప్తంగా ఈనెల 21న పల్స్‌ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నట్లు డీఎంహెచ్‌వో భాస్కరరావు తెలిపారు. దీనికి సంబంధించిన వాల్‌ పోస్టర్‌ను గురువారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు.

  Pulse Polio   21న జిల్లా వ్యాప్తంగా పల్స్‌పోలియో
పోస్టర్‌ను విడుదల చేస్తున్న డీఎంహెచ్‌వో తదితరులు

పార్వతీపురం, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా ఈనెల 21న పల్స్‌ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నట్లు డీఎంహెచ్‌వో భాస్కరరావు తెలిపారు. దీనికి సంబంధించిన వాల్‌ పోస్టర్‌ను గురువారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 905 కేంద్రాల్లో 99,507 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నట్టు వెల్లడించారు. బస్సు, రైల్వేస్టేషన్లలో 19 ట్రాన్సిల్‌ బూత్‌లను ఏర్పాటు చేశామన్నారు. 42 మొబైల్‌ బృందాల ద్వారా హైరిస్క్‌ మారుమూల ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు. 22, 23 తేదీల్లో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తారని స్పష్టం చేశారు.

Updated Date - Dec 18 , 2025 | 11:30 PM