గుజరాత్లో జిల్లా మత్స్యకారుడి మృతి
ABN , Publish Date - Sep 18 , 2025 | 12:13 AM
చింతపల్లి గ్రామా నికి చెందిన బడి రాముడు(44) అనే మత్స్యకారుడు గుజరాత్ రాష్ట్రం వీరావల్లో సముద్రంలో వేట సాగిస్తూ బుధవారం మృతిచెందాడు.
పూసపాటిరేగ, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): చింతపల్లి గ్రామా నికి చెందిన బడి రాముడు(44) అనే మత్స్యకారుడు గుజరాత్ రాష్ట్రం వీరావల్లో సముద్రంలో వేట సాగిస్తూ బుధవారం మృతిచెందాడు. రాముడు జీవనోపాధి నిమిత్తం అక్కడకు వేటకు వెళ్లాడు. అయితే అక్కడ సముద్రంలో వేట సాగిస్తూ ప్రమాదవ శాత్తు మృతిచెందాడు. మృదేహాన్ని స్వగ్రామం చింతపల్లికి తీసుకొస్తున్నారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.