కనకమహాలక్ష్మికి అన్నంతో అభిషేకం
ABN , Publish Date - Dec 26 , 2025 | 12:25 AM
నగరంలోని ఫ్రూట్స్ మార్కెట్ రోడ్డులో ఉన్న కనకమహాలక్ష్మీ ఆలయంలో పుష్యమాస గురువారాన్ని పురస్కరించుకుని అమ్మవారికి అన్నంతో అభిషేకాన్ని నిర్వహించారు.
విజయనగరం రూరల్, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): నగరంలోని ఫ్రూట్స్ మార్కెట్ రోడ్డులో ఉన్న కనకమహాలక్ష్మీ ఆలయంలో పుష్యమాస గురువారాన్ని పురస్కరించుకుని అమ్మవారికి అన్నంతో అభిషేకాన్ని నిర్వహించారు. ఆలయ అర్చకుడు గాయత్రీ శర్మ మంత్రోచ్చారణ నడుమ 11 మంది మహిళలు అమ్మవారికి అన్నాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.