Currency Notes.. కరెన్సీ నోట్లతో కనులపండువగా..
ABN , Publish Date - Sep 26 , 2025 | 11:20 PM
A Visual Treat with Currency Notes.. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సాలూరు పట్టణంలో కామాక్షి అమ్మవారిని రూ.4 లక్షల కరెన్సీ నోట్లతో ప్రత్యేకంగా అలం కరించారు. ముందుగా ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు, అర్చనలు చేశారు.
సాలూరు, సెప్టెంబరు26(ఆంధ్రజ్యోతి): శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సాలూరు పట్టణంలో కామాక్షి అమ్మవారిని రూ.4 లక్షల కరెన్సీ నోట్లతో ప్రత్యేకంగా అలం కరించారు. ముందుగా ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు, అర్చనలు చేశారు. అనంతరం సాలూరుతో పాటు పరిసర ప్రాంత భక్తులు పెద్దఎత్తున తరలించి కామాక్షి అమ్మవారిని దర్శించుకుని పులకించిపోయారు. ఆ తర్వాత ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.