Share News

వైభవంగా తిరుగు రథయాత్ర

ABN , Publish Date - Jul 06 , 2025 | 11:59 PM

పట్టణంలో జగన్నాథస్వామి రథోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.

వైభవంగా తిరుగు రథయాత్ర
రథాన్ని లాగుతున్న భక్తులు

పాలకొండ, జూలై 6 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో జగన్నాథస్వామి రథోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా స్వామివారి తిరుగు రథయాత్రను ఆదివారం వైభవంగా నిర్వహించారు. మారు దశమి రెండో రోజు సుభద్ర, బలభద్ర సమేతుడైన జగన్నాథస్వామి రథకంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం గుడించా మందిరం నుంచి బయలుదేరి పిన్నమగుడికి రథంపై చేరుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు మఠం విశ్వనాథదాస్‌ స్వామివారికి ప్రత్యేక పూజ లు నిర్వహించారు. పాలకొండ పట్టణంతో పాటు సమీప గ్రామాల ప్రజలు తరలి వచ్చి రథాన్ని లాగి తమ భక్తిని చాటుకు న్నారు. ఆలయ ఈవో సర్వేశ్వరరావు ప్రత్యేక పర్యవేక్షణ చేశారు.

Updated Date - Jul 06 , 2025 | 11:59 PM