బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్కు ఘనస్వాగతం
ABN , Publish Date - Jul 04 , 2025 | 01:16 AM
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత తొలిసారి నగరానికి వచ్చిన పీవీఎన్ మాధవ్కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.
గోపాలపట్నం, జూలై 3 (ఆంధ్రజ్యోతి):
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత తొలిసారి నగరానికి వచ్చిన పీవీఎన్ మాధవ్కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్ నుంచి గురువారం సాయంత్రం విశాఖ చేరుకున్న మాధవ్కు నగర బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన ర్యాలీగా నగరంలోని పార్టీ కార్యాలయానికి వెళ్లారు.