పరిశ్రమల ఏర్పాటుకు సత్వర చర్యలు
ABN , Publish Date - Sep 26 , 2025 | 12:49 AM
జిల్లాలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు సత్వరమే చర్యలు చేపట్టాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సహక కమిటీ (డీఐఈపీసీ) 16వ జిల్లాస్థాయి సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా గత సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యలను జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ పీకేపీ ప్రసాద్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ ఎం.నరసింహారావు వివరించారు.
పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి
అధికారులకు కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశం
అనకాపల్లి కలెక్టరేట్, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు సత్వరమే చర్యలు చేపట్టాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సహక కమిటీ (డీఐఈపీసీ) 16వ జిల్లాస్థాయి సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా గత సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యలను జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ పీకేపీ ప్రసాద్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ ఎం.నరసింహారావు వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, గత జూలై 29న జరిగిన సమావేశం తరువాత నుంచి ఇప్పటి వరకు వివిధ శాఖల అనుమతి కోసం 1,573 దరఖాస్తులు రాగా, వాటిలో 1,462 దరఖాస్తులను ఆమోదించామని ఆమె తెలిపారు. వివిధ శాఖల అధికారులతో మాట్లాడి మిగిలిన దరఖాస్తులను త్వరగా ఆమోదించాలని ఆదేశించారు. జిల్లాలో 12 పరిశ్రమలకు సంబంధించిన వివిధ రాయితీల కోసం 21 దరఖాస్తులు రాగా రూ.7.46 కోట్ల విడుదలకు కమిటీ సమావేశంలో ఆమోదం తెలిపామన్నారు. నక్కపల్లిలో నూతనంగా పారిశ్రామిక పార్క్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో కొత్తగా 46 భారీ, అతి భారీ పరిశ్రమల స్థాపనకు ప్రతిపాదనలు వివిధ దశల్లో ఉన్నాయని వీటి ద్వారా రూ.2,89,161.85 కోట్ల పెట్టుబడులు, 1,56,556 మందికి ఉద్యోగ, ఉపాధి కల్పించే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ సమావేశంలో జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఈఈ ముకుందరావు తదితరులు పాల్గొన్నారు.