లంబసింగిలో పర్యాటకుల సందడి
ABN , Publish Date - Jul 06 , 2025 | 11:42 PM
ఆంధ్ర కశ్మీర్ లంబసింగిలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రకృతి అందాలను వీక్షించేందుకు పర్యాటకులు తరలి వచ్చారు.
చింతపల్లి, జూలై 6 (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర కశ్మీర్ లంబసింగిలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రకృతి అందాలను వీక్షించేందుకు పర్యాటకులు తరలి వచ్చారు. ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు చెరువులవేనం వ్యూపాయింట్ వద్ద పర్యాటకులు ప్రకృతి సౌందర్యాన్ని వీక్షిస్తూ ఎంజాయ్ చేశారు. తాజంగి జలాశయం, లంబసింగి జంక్షన్లో పర్యాటకుల రద్దీ కనిపించింది. ప్రస్తుతం పర్యాటక సీజన్ కాకపోయినప్పటికి లంబసింగిని పర్యాటకులు అధిక సంఖ్యలో సందర్శిస్తున్నారు.