గిరిజన విద్యార్థులకు ఏ లోటు లేకుండా చూడండి
ABN , Publish Date - Jul 23 , 2025 | 12:16 AM
గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల్లోని గిరిజన విద్యార్థులకు ఎటువంటి లోటు లేకుండా చూసుకోవాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎస్.భార్గవి ఆదేశించారు. మండలంలోని గుత్తులపుట్టు బాలికల ఆశ్రమ పాఠశాలను ఆమె మంగళవారం సందర్శించారు.
టీడబ్ల్యూ డైరెక్టర్ ఎస్.భార్గవి
గుత్తులపుట్టు బాలికల ఆశ్రమ పాఠశాల సందర్శన
పాడేరు, జూలై 22(ఆంధ్రజ్యోతి): గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల్లోని గిరిజన విద్యార్థులకు ఎటువంటి లోటు లేకుండా చూసుకోవాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎస్.భార్గవి ఆదేశించారు. మండలంలోని గుత్తులపుట్టు బాలికల ఆశ్రమ పాఠశాలను ఆమె మంగళవారం సందర్శించారు. ఈ సందర్బంగా టీచర్లు, బాలికలతో మాట్లాడారు. అక్కడ అందుతున్న బోధన, సదుపాయాలపై ఆరా తీశారు. ఆశ్రమ పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్థులు చక్కగా చదువుకుని ఉన్నతంగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఇన్చార్జి పీవో డాక్టర్ ఎంజే.అభిషేక్గౌడ, టీచర్లు పాల్గొన్నారు.