నిండుకుండలా జలాశయాలు
ABN , Publish Date - Aug 31 , 2025 | 10:47 PM
ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రానికి నీరందించే జోలాపుట్టు, డుడుమ జలాశయాలు ప్రస్తుతం నిండుకుండలా దర్శనమిస్తున్నాయి.
జోలాపుట్టు, డుడుమ నుంచి నీరు విడుదల
ముంచంగిపుట్టు, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రానికి నీరందించే జోలాపుట్టు, డుడుమ జలాశయాలు ప్రస్తుతం నిండుకుండలా దర్శనమిస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆ రెండు జలాశయాల్లో నీటి నిల్వలు గరిష్ఠ స్థాయికి చేరిన విషయం తెలిసిందే. జోలాపుట్టు జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 2,750 అడుగులు కాగా, ఆదివారం 2,747.95 అడుగులకు చేరింది. ఇక్కడ నుంచి 5 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. డుడుమ జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 2,590 అడుగులు కాగా, ప్రస్తుతం 2,580.10 అడుగులకు చేరింది. ఈ జలాశయం నుంచి బలిమెలకు 3 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.