Share News

అనకాపల్లిలో నిలిచిన రాయగడ ఎక్స్‌ప్రెస్‌

ABN , Publish Date - Aug 30 , 2025 | 01:13 AM

విజయనగరం స్టేషన్‌ వద్ద శుక్రవారం ఉదయం గూడ్స్‌ రైలు పట్టాలు తప్పడంతో ఆ ప్రభావం గుంటూరు- రాయగడ ఎక్స్‌ప్రెస్‌పై పడింది. అనకాపల్లి రైల్వే స్టేషన్‌లో సుమారు నాలుగు గంటలపాటు నిలిచిపోయింది. దీంతో సకాలంలో గమ్యస్థానాలకు చేరలేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసహనం చెందారు.

అనకాపల్లిలో నిలిచిన రాయగడ ఎక్స్‌ప్రెస్‌
ప్లాట్‌ఫారంపై నిలిచి ఉన్న గుంటూరు- రాయగడ ఎక్స్‌ప్రెస్‌

నాలుగు గంటలపాటు ఇబ్బంది పడిన ప్రయాణికులు

అనకాపల్లి టౌన్‌, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): విజయనగరం స్టేషన్‌ వద్ద శుక్రవారం ఉదయం గూడ్స్‌ రైలు పట్టాలు తప్పడంతో ఆ ప్రభావం గుంటూరు- రాయగడ ఎక్స్‌ప్రెస్‌పై పడింది. అనకాపల్లి రైల్వే స్టేషన్‌లో సుమారు నాలుగు గంటలపాటు నిలిచిపోయింది. దీంతో సకాలంలో గమ్యస్థానాలకు చేరలేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసహనం చెందారు. ఉదయం ఏడు గంటలకు అనకాపల్లి వచ్చిన గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్‌ 11 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరింది. దువ్వాడ, విశాఖపట్నం వరకు వెళ్లాల్సిన ప్రయాణికులు ఇక్కడ రైలు దిగేసి, రోడ్డు మార్గంలో గమ్యస్థానాలకు బయలుదేరి వెళ్లారు. విజయనగరం, గజపతినగరం, బొబ్బిలి, పార్వతీపురం, రాయగడ వెళ్లే ప్రయాణికులు మాత్రం రైలులోనే వుండిపోయారు.

Updated Date - Aug 30 , 2025 | 01:13 AM