Share News

రేషన్‌ డిపోల మరమ్మతులకు నిధులు ఇవ్వండి

ABN , Publish Date - Jun 24 , 2025 | 11:54 PM

శిథిలావస్థలో ఉన్న జీసీసీ రేషన్‌ డిపోల మరమ్మతులకు నిధులు కేటాయించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణిని జీసీసీ చైర్మన్‌ కిడారి శ్రావణ్‌కుమార్‌ కోరారు.

రేషన్‌ డిపోల మరమ్మతులకు నిధులు ఇవ్వండి
అమరావతిలో మంత్రి సంధ్యారాణికి వినతిపత్రం అందజేస్తున్న జీసీసీ చైర్మన్‌ శ్రావణ్‌కుమార్‌, డైరెక్టర్లు

మంత్రి సంధ్యారాణిని కోరిన జీసీసీ చైర్మన్‌ కిడారి

పాడేరు, జూన్‌ 24(ఆంధ్రజ్యోతి): శిథిలావస్థలో ఉన్న జీసీసీ రేషన్‌ డిపోల మరమ్మతులకు నిధులు కేటాయించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణిని జీసీసీ చైర్మన్‌ కిడారి శ్రావణ్‌కుమార్‌ కోరారు. ఈ మేరకు ఆయన మంగళవారం అమరావతిలో మంత్రిని కలిసి వినతిపత్రాన్ని అందజేసి సమస్యను వివరించారు. రేషన్‌ డిపోలు గత ఐదేళ్లుగా వినియోగంలో లేకపోవడంతో శిథిలమయ్యాయని, ప్రస్తుతం డిపోల ద్వారా రేషన్‌ సరుకుల పంపిణికి శ్రీకారం చుట్టడంతో డిపోలకు మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకువచ్చేందుకు నిధులు మంజూరు చేయాలని ఆయన కోరారు. తమ అభ్యర్థనకు మంత్రి సంధ్యారాణి సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జీసీసీ డైరెక్టర్లు రవికుమార్‌, సేన్యనాయక్‌, అరుణకుమారి, అంజయ్య పాల్గొన్నారు.

Updated Date - Jun 24 , 2025 | 11:54 PM