నూకాంబిక ఆలయానికి నూతన పాలకవర్గం
ABN , Publish Date - Nov 01 , 2025 | 01:13 AM
నూకాంబిక ఆలయానికి నూతన పాలకవర్గం
చైర్మన్గా పీలా నాగశ్రీను
అనకాపల్లి టౌన్, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): స్థానిక నూకాంబిక అమ్మవారి ఆలయానికి నూతన పాలకవర్గాన్ని నియమిస్తూ దేవదాయ శాఖ అధికారులు శుక్రవారంఉత్తర్వులు జారీ చేశారు. చైర్మన్గా పీలా నాగశ్రీను, సభ్యులుగా సూరే సతీశ్కుమార్, మారిశెట్టి శంకరరావు, పొలిమేర స్వాతి, కాండ్రేగుల రాజారావు, కోనేటి సూర్యలక్ష్మి, వడ్డాది మంగ, దాడి రవికుమార్, మజ్జి జానకి, కొడుకుల శ్రీకాంత్, యర్రవరపు సంతోషికుమారి నియమితులయ్యారు. త్వరలో మంచి ముహూర్తం చూసుకుని ప్రమాణస్వీకారం చేస్తామని నూతన చైర్మన్ నాగశ్రీను చెప్పారు.