నర్సీపట్నం టిడ్కో ఇళ్లు వచ్చే నెలాఖరుకు అప్పగింత
ABN , Publish Date - May 02 , 2025 | 12:12 AM
నర్సీపట్నంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను జూన్ నెలాఖరునాటికి లబ్ధిదారులకు అప్పగించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టందని ఏపీ టిడ్కో స్టేట్ కో-ఆర్డినేటర్ సీహెచ్ నాగబాబు తెలిపారు. గురువారం మునిసిపల్ కార్యాలయంలో కమిషనర్ సురేంద్రపాటు మెప్మా సిబ్బందితో సమావేశం నిర్వహించారు. టిడ్కో ఇళ్ల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.
సంస్థ రాష్ట్ర కోఆర్డినేటర్ నాగబాబు
నర్సీపట్నం, మే 1 (ఆంధ్రజ్యోతి): నర్సీపట్నంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను జూన్ నెలాఖరునాటికి లబ్ధిదారులకు అప్పగించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టందని ఏపీ టిడ్కో స్టేట్ కో-ఆర్డినేటర్ సీహెచ్ నాగబాబు తెలిపారు. గురువారం మునిసిపల్ కార్యాలయంలో కమిషనర్ సురేంద్రపాటు మెప్మా సిబ్బందితో సమావేశం నిర్వహించారు. టిడ్కో ఇళ్ల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన టిడ్కో కాలనీని సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, టిడ్కో గృహసముదాయాల్లో మౌలిక సదుపాయాల కల్పన పనులు త్వరగా పూర్తిచేయిస్తామని చెప్పారు. ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరగతిన పూర్తి చేయడానికి చర్యలు తీసుకున్నామని, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయిస్తామని ఆయన చెప్పారు. తర్వాత ఆ డాక్యుమెంట్లను బ్యాంకులకు అందజేస్తే రుణాలు మంజూరు అవుతాయని అన్నారు. ఈ సమావేశంలో మెప్మా సీవో రమాదేవి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.