Share News

జాతీయ పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో నాగజ్యోతి సత్తా

ABN , Publish Date - Oct 13 , 2025 | 12:32 AM

జాతీయ పవర్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌-2025 పోటీల్లో రోలుగుంట జడ్పీ ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయిని పీఎం నాగజ్యోతి సత్తా చాటారు. కర్ణాటక స్టేట్‌ పవర్‌ లిఫ్టర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో బెంగళూరులో ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించిన ఈ పోటీల్లో 8 రాష్ర్టాలకు చెందిన సుమారు 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.

జాతీయ పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో నాగజ్యోతి సత్తా
జాతీయ పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో సాధించిన పతకాలతో నాగజ్యోతి

రెండు స్వర్ణ, ఒక రజత పతకాలు సాధించిన ఉపాధ్యాయిని

రోలుగుంట, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): జాతీయ పవర్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌-2025 పోటీల్లో రోలుగుంట జడ్పీ ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయిని పీఎం నాగజ్యోతి సత్తా చాటారు. కర్ణాటక స్టేట్‌ పవర్‌ లిఫ్టర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో బెంగళూరులో ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించిన ఈ పోటీల్లో 8 రాష్ర్టాలకు చెందిన సుమారు 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. దీనిలో భాగంగా మాస్టర్స్‌ 72 కేజీల విభాగంలో పాల్గొన్న నాగజ్యోతి డెడ్‌ లిఫ్ట్‌, బెంచ్‌ ప్రెస్‌, పుష్‌-ఫుల్‌ విభాగాల్లో అద్భుత ప్రదర్శన కనబరిచారు. బెంచ్‌ ప్రెస్‌ విభాగంలో స్వర్ణం, డెడ్‌ లిఫ్ట్‌ విభాగంలో స్వర్ణం, పుష్‌- ఫుల్‌ విభాగంలో రజత పతకాన్ని సాధించారు. ఒక సిల్వర్‌ మెడల్‌ను సాధించారు. పతకాలు సాధించిన నాగజ్యోతిని పాఠశాల హెచ్‌ఎం శేషగిరిరావు, ఉపాధ్యాయులు అభినందించారు.

Updated Date - Oct 13 , 2025 | 12:32 AM