Share News

దొంగ ఓట్లతోనే మోదీ గెలుపు

ABN , Publish Date - Oct 08 , 2025 | 12:51 AM

ఓట్‌ చోర్‌-గద్దీ చోడ్‌ (ఓట్ల దొంగ-గద్దె దిగండి) నినాదంతో కాంగ్రెస్‌ పార్టీ మంగళవారం సాయంత్రం నగరంలో కార్యక్రమం నిర్వహించింది.

దొంగ ఓట్లతోనే మోదీ గెలుపు

పీసీసీ అధ్యక్షురాలు వై.ఎ్‌స.షర్మిల ఆరోపణ

నగరంలో ఓట్‌ చోర్‌- గద్దీ చోడ్‌ క్యాంపెయిన్‌ నిర్వహణ

విశాఖపట్నం, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి):

ఓట్‌ చోర్‌-గద్దీ చోడ్‌ (ఓట్ల దొంగ-గద్దె దిగండి) నినాదంతో కాంగ్రెస్‌ పార్టీ మంగళవారం సాయంత్రం నగరంలో కార్యక్రమం నిర్వహించింది. ఉత్తర నియోజకవర్గ పరిధిలో జరిగిన ఈ క్యాంపెయిన్‌లో పీసీసీ అధ్యక్షురాలు వై.ఎ్‌స.షర్మిల పాల్గొన్నారు. స్థానిక ప్రజలతో ఆమె మమేకమై సంతకాలు సేకరించారు. ఓట్ల చోరీ వ్యవహారంపై రాహుల్‌గాంధీ చేస్తున్న పోరాటాన్ని ప్రజలకు షర్మిల వివరించారు. కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు అండగా నిలవాలని కోరారు. దేశంలో ఓట్ల చోరీ జరిగిందని, దొంగ ఓట్లతో మోదీ గెలిచారని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ పిలుపు మేరకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకువచ్చి సంతకాలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు అడ్డాల వర్మరాజు, ఉత్తరాంద్ర ఇన్‌చార్జి లక్కరాజు రామారావు, నాయకులు ప్రియాంక దండి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 08 , 2025 | 12:51 AM