Share News

మంత్రి లోకేశ్‌ 22న అరకులోయ రాక

ABN , Publish Date - Nov 15 , 2025 | 01:18 AM

రాష్ట్ర మానవ వనరుల (విద్య) శాఖా మంత్రి నారా లోకేశ్‌ ఈ నెల 22వ తేదీన అరకులోయ పర్యటనకు వస్తున్నారని, ఈ సందర్భంగా ఏదో ఒక క్లస్టర్‌ స్కూల్‌ కాంప్లెక్స్‌ను తనిఖీ చేస్తారని జిల్లా విద్యా శాఖాధికారి బ్రహ్మాజీ చెప్పారు.

మంత్రి లోకేశ్‌ 22న అరకులోయ రాక
అరకులోయ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎంఈవోలు, హెచ్‌ఎంతో సమావేశమైన డీఈవో బ్రహ్మాజీ

క్లస్టర్‌ స్కూల్‌ కాంప్లెక్స్‌ తనిఖీ

డీఈవో బ్రహ్మాజీ వెల్లడి

అరకులోయ, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మానవ వనరుల (విద్య) శాఖా మంత్రి నారా లోకేశ్‌ ఈ నెల 22వ తేదీన అరకులోయ పర్యటనకు వస్తున్నారని, ఈ సందర్భంగా ఏదో ఒక క్లస్టర్‌ స్కూల్‌ కాంప్లెక్స్‌ను తనిఖీ చేస్తారని జిల్లా విద్యా శాఖాధికారి బ్రహ్మాజీ చెప్పారు. శుక్రవారం ఇక్కడకు వచ్చిన ఆయన ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కంఠబౌంసుగుడ బాలుర ఆశ్రమోన్నత పాఠశాల, రవ్వలగుడ జీటీడబ్ల్యూఎస్‌ బాలుర పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా సంబంధిత పాఠశాలల హెచ్‌ఎంలు మోహన్‌రావు, ఎల్‌బీ దయానిధి, టి.నాగేశ్వరరావులకు పలు సూచనలు చేశారు. మంత్రి నారా లోకేశ్‌ ఈ నెల 22వ తేదీన ఈ మూడు పాఠశాలల్లో ఏదో ఒకదానిని సందర్శించే అవకాశం వుందన్నారు. అనంతరం ఆయన అరకులోయ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఎంఈవోలు, వివిధ పాఠశాలల హెచ్‌ఎంలతో సమావేశమయ్యారు. డీఈవో వెంట డిప్యూటీ డీఈవో చల్లయ్య, తదితరులు వున్నారు.

Updated Date - Nov 15 , 2025 | 01:18 AM