ఆదిలక్ష్మిగా కనకమహాలక్ష్మి దర్శనం
ABN , Publish Date - Sep 24 , 2025 | 01:03 AM
శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బురుజుపేటలోని కనకమహాలక్ష్మి అమ్మవారు మంగళవారం ఆదిలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
మహారాణిపేట, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి):
శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బురుజుపేటలోని కనకమహాలక్ష్మి అమ్మవారు మంగళవారం ఆదిలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి లక్ష కుంకుమార్చన నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. బుధవారం అమ్మవారు ధనలక్ష్మి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.