మత్స్యకారుల వలలో భారీ చేపలు
ABN , Publish Date - May 19 , 2025 | 01:07 AM
చాలా కాలం తరువాత రైవాడ జలాశయంలో మత్స్యకారులకు భారీ చేపలు చిక్కాయి. సాధారణంగా రెండు, మూడు కిలోల బరువున్న చేపలు వలలో పడుతుంటాయి.
ఒక్కోటి ఎనిమిది కిలోల పైబడి బరువు
కిలో రూ.200 రేటుకు అమ్మకం
దేవరాపల్లి, మే 18 (ఆంధ్రజ్యోతి) చాలా కాలం తరువాత రైవాడ జలాశయంలో మత్స్యకారులకు భారీ చేపలు చిక్కాయి. సాధారణంగా రెండు, మూడు కిలోల బరువున్న చేపలు వలలో పడుతుంటాయి. అయితే ఆదివారం వేటకు వెళ్లిన మత్స్యకారుల్లో సంజీవ్, కనక అనే ఇద్దరికి సుమారు ఎనిమిది కిలోల బరువున్న రెండు చేపలు వలకు చిక్కాయి. వీటిని ఒడ్డుకు తీసుకురాగా.. అప్పటికే వేచివున్న కొనుగోలుదారులు వాటిని దక్కించుకోవడానికి పోటీపడ్డారు. కిలో రూ.200 చొప్పున ఒక్కో చేపను రూ.1,600లకు కొనుగోలు చేశారు. ఇంత భారీ చేపలు చాలా అరుదుగా లభిస్తుంటాయని మత్స్యకారులు చెప్పారు.