Share News

హైవే నిర్మాణంతో పురాతన వంతెనలకు మోక్షం

ABN , Publish Date - Mar 11 , 2025 | 12:31 AM

మండలంలో బ్రిటిష్‌ కాలంలో నిర్మించిన వంతెనలకు మోక్షం కలిగింది. రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి 516-ఈ పనుల్లో భాగంగా శిథిలావస్థకు చేరిన వంతెలను తొలగించి వాటి స్థానంలో నూతన వంతెనలను నిర్మిస్తున్నారు. ఈ పనులు దాదాపు పూర్తికావచ్చాయి.

హైవే నిర్మాణంతో పురాతన వంతెనలకు మోక్షం
రామరాజుపాలెం వద్ద కొత్తగా వంతెన నిర్మించి అప్రోచ్‌ రోడ్డు వేసిన దృశ్యం

మండలంలో బ్రిటిష్‌ కాలం నాటి రెండు బ్రిడ్జిలను తొలగించి కొత్తగా నిర్మాణం

తీరనున్న వాహనచోదకుల కష్టాలు

కొయ్యూరు, మార్చి 10(ఆంధ్రజ్యోతి): మండలంలో బ్రిటిష్‌ కాలంలో నిర్మించిన వంతెనలకు మోక్షం కలిగింది. రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి 516-ఈ పనుల్లో భాగంగా శిథిలావస్థకు చేరిన వంతెలను తొలగించి వాటి స్థానంలో నూతన వంతెనలను నిర్మిస్తున్నారు. ఈ పనులు దాదాపు పూర్తికావచ్చాయి.

మండలంలోని పెదమాకవరం పంచాయతీ రామరాజుపాలెం వద్ద, అలాగే మాకవరం- నడింపాలెం గ్రామాల మధ్య బ్రిటిష్‌ కాలంలో నిర్మించిన వంతెనలే గత ఏడాది వరకు రాకపోకలకు ఆధారం. కృష్ణాదేవిపేట నుంచి చింతపల్లి వెళ్లే ప్రఽధాన రహదారిలో సుమారు ఎనిమిది దశాబ్దాల క్రితం బ్రిటిష్‌ పాలనలో ఈ వంతెనలను నిర్మించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ వంతెనలకు కనీస మరమ్మతులు చేసిన దాఖలాలు లేవు. వంతెనలకు ఇరువైపులా రెయిలింగ్‌లు దెబ్బతిన్నా అధికారులు పట్టించుకోలేదు. దీంతో వాహనచోదకులు భయాందోళనతో రాకపోకలు సాగించేవారు. అయితే రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వరకు జాతీయ రహదారి 516-ఈ పనులు ఈ గ్రామాల మీదుగా జరుగుతుండడంతో రామరాజుపాలెం, పి.మాకవరం వంతెనలకు మోక్షం కలిగింది. శిథిలావస్థకు చేరిన ఈ రెండు వంతెనలను పూర్తిగా తొలగించి వాటి స్థానంలో నూతన వంతెనలు నిర్మించారు. ప్రస్తుతం ఈ వంతెనలకు అప్రోచ్‌ రోడ్డు పనులు చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో కొత్త వంతెనలు నిర్మించడంపై స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Mar 11 , 2025 | 12:31 AM