ఆర్ఎల్సీ సమక్షంలో చర్చలు మళ్లీ వాయిదా
ABN , Publish Date - Jun 19 , 2025 | 12:19 AM
స్టీల్ ప్లాంట్ యాజమాన్యం, కాంట్రాక్టు కార్మిక సంఘాల మధ్య రీజనల్ లేబర్ కమిషనర్ (ఆర్ఎల్సీ) సమక్షంలో బుధవారం జరిగిన చర్చలు మళ్లీ వాయిదా పడ్డాయి. కాంట్రాక్టు కార్మికులు నిరవధిక సమ్మె చేపట్టి, నిలిపివేసిన సంగతి తెలిసందే.
స్టీల్ ప్లాంట్ కాంట్రాక్టు కార్మిక సంఘ నాయకులు
ఉక్కుటౌన్షిప్, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): స్టీల్ ప్లాంట్ యాజమాన్యం, కాంట్రాక్టు కార్మిక సంఘాల మధ్య రీజనల్ లేబర్ కమిషనర్ (ఆర్ఎల్సీ) సమక్షంలో బుధవారం జరిగిన చర్చలు మళ్లీ వాయిదా పడ్డాయి. కాంట్రాక్టు కార్మికులు నిరవధిక సమ్మె చేపట్టి, నిలిపివేసిన సంగతి తెలిసందే. ఈ మధ్యలో రెండుసార్లు చర్చలు జరిగినా ఆ సమావేశాలకు ఉక్కు యాజమాన్య ప్రతినిధులు హాజరు కాలేదు. తాజాగా బుధవారం జరిగిన చర్చల్లో కాంట్రాక్టు కార్మిక సంఘ నాయకులు మాట్లాడుతూ తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, ఇకపై ఎవరినీ తొలగించరాదని కోరారు. అయితే దీనిపై యాజమాన్య ప్రతినిధులు ఎటువంటి హామీ ఇవ్వలేదని నాయకులు పేర్కొన్నారు కాగా సంస్థకు చెందిన కాంట్రాక్టర్లు హాజరు కాకపోవడంతో ఈ చర్చలను ఈ నెల 26వ తేదికి వాయిదా వేసినట్టు వారు తెలిపారు.