Share News

పర్యాటకుల సందడి

ABN , Publish Date - Dec 28 , 2025 | 11:21 PM

మన్యంలోని పర్యాటక ప్రాంతాలు ఆదివారం కిటకిటలాడాయి. వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడం, మంచు దట్టంగా కురుస్తుండడంతో అధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చారు.

పర్యాటకుల సందడి
పర్యాటకులతో కిటకిటలాడుతున్న చెరువులవేనం వ్యూపాయింట్‌

మన్యంలోని పర్యాటక ప్రాంతాలు కిటకిట

సహజ సిద్ధ ప్రకృతి అందాలు, మంచు మేఘాలకు ఫిదా

లంబసింగి, వంజంగి మేఘాల కొండ వద్ద ఎక్కువ రద్దీ

పాడేరు, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): మన్యంలోని పర్యాటక ప్రాంతాలు ఆదివారం కిటకిటలాడాయి. వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడం, మంచు దట్టంగా కురుస్తుండడంతో అధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చారు. దీంతో అన్ని పర్యాటక కేంద్రాల్లో సందడి నెలకొంది.

అనంతగిరి మండలంలో బొర్రా గుహలు మొదలుకుని చింతపల్లి మండలం లంబసింగి వరకు పర్యాటకుల కోలాహలం కనిపించింది. అనంతగిరి మండలంలో బొర్రా గుహలు, కటికి, తాడిగుడ జలపాతాలు, అరకులోయ మండలంలో మాడగడ మేఘాల కొండ, గిరిజన మ్యూజియం, పద్మాపురం ఉద్యానవనం, గిరి గ్రామదర్శిని, ఆయా ప్రాంతాల్లోని వలిసెలు పూల తోటలు, డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి గెడ్డ, పాడేరు మండలంలో మోదాపల్లి కాఫీ తోటలు, వంజంగి హిల్స్‌, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, చింతపల్లి మండలంలో తాజంగి రిజర్వాయర్‌, చెరువులవేనం మేఘాల కొండ, లంబసింగి, యర్రవరం జలపాతం తదితర ప్రాంతాలను పర్యాటకులు సందర్శించారు.

Updated Date - Dec 28 , 2025 | 11:21 PM