ఆలయాలకు ధర్మకర్తల మండళ్లు
ABN , Publish Date - May 10 , 2025 | 12:13 AM
జిల్లాలో దేవదాయ శాఖ పరిధిలో ఉన్న 16 ఆలయాలకు ధర్మకర్తల మండళ్లు ఏర్పాటు చేయడానికి దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఔత్సాహికుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఉత్తర్వులు జారీ చేశారు.

దరఖాస్తుకు ఈ నెల 25వ తేదీ వరకు గడువు
జిల్లాలో 16 ఆలయాలకు దేవదాయ శాఖ నోటిఫికేషన్
నర్సీపట్నం, మే 9 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో దేవదాయ శాఖ పరిధిలో ఉన్న 16 ఆలయాలకు ధర్మకర్తల మండళ్లు ఏర్పాటు చేయడానికి దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఔత్సాహికుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఉత్తర్వులు జారీ చేశారు. దరఖాస్తుదారుని వయస్సు 30 సంవత్సరాలపైబడి ఉండాలని, ఇరవై రోజుల్లో జిల్లా దేవదాయ శాఖ అధికారికి దరఖాస్తులు అందజేయాలని ఈ నెల 6న విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. సబ్బవరం మండలం సోమనాథపురంలోని సోమలింగేశ్వరస్వామి ఆలయం, అనకాపల్లి మండలం సత్యనారాయణపురంలో సత్యనారాయణస్వామి ఆలయం, అనకాపలి పట్టణంలో జగన్నాథస్వామి ఆలయం, భోగలింగేశ్వరస్వామి ఆలయం, కశింకోటలో సత్యనారాయణస్వామి ఆలయం, చోడవరంలో వ్రేంకటేశ్వరస్వామి ఆలయం, స్వయంభూ గౌరీశ్వరస్వామి ఆలయం, హార్డింగ్ రెస్ట్ హౌస్, బుచ్చెయ్యపేట మండలం వడ్డాదిలో వేంకటేశ్వరస్వామి ఆలయం, రావికమతం మండలంలో కల్యాణ పోతురాజు పెద్దింటి అమ్మవారి ఆలయం, నర్సీపట్నంలో వేంకటేశ్వరస్వామి ఆలయం, దుర్గామల్లేశ్వరస్వామి ఆలయం, నూకాలమ్మ అమ్మవారి ఆలయం, నక్కపల్లి మండలం ఒడ్డిమెట్టలో లక్ష్మీగణపతి ఆలయం, ఎలమంచిలిలో లోకల్ ఫండ్ చౌలీ్ట్ర, అచ్యుతాపురం మండలం రావిపాలెంలో కోదండరామస్వామి ఆలయ కమిటీలకు ధర్మకర్త మండళ్లు ఏర్పాటు చేయడానికి ప్రకటన విడుదల చేశారు. పాలక మండలిలో 50 శాతం మంది ఎస్టీ, ఎస్సీ, బీసీ వర్గాలు ఉండాలని, మొత్తం మీద 50 శాతం మహిళలు వుండాలని పేర్కొన్నారు. నాయీ బ్రాహ్మణులు, అర్చకులు కమిటీలో కచ్చితంగా ఉండాలని స్పష్టం చేశారు.