Share News

ఏయూ హాస్టల్‌ విద్యార్థుల ఆందోళన

ABN , Publish Date - Jul 23 , 2025 | 01:09 AM

ఆంధ్ర విశ్వవిద్యాలయం వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులు మంగళవారం రాత్రి తొమ్మిది గంటలకు ఏయూ ప్రధానగేటు ముందు ఆందోళనకు దిగారు.

ఏయూ హాస్టల్‌ విద్యార్థుల ఆందోళన

విశాఖపట్నం, జూలై 22 (ఆంధ్రజ్యోతి):

ఆంధ్ర విశ్వవిద్యాలయం వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులు మంగళవారం రాత్రి తొమ్మిది గంటలకు ఏయూ ప్రధానగేటు ముందు ఆందోళనకు దిగారు. వసతి గృహాల్లో నెలకొన్న ప్రధాన సమస్యలను పరిష్కరించాలని, ఫీజుల భారాన్ని తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని విద్యార్థులను వెనక్కి పంపించేందుకు యత్నించినా ససేమిరా అన్నారు. ఉన్నతాధికారులు వచ్చేంత వరకూ తాము కదిలేదని లేదని భీష్మించుకు కూర్చున్నారు. అయితే విద్యార్థులతో పోలీస్‌ అధికారులు చర్చలు జరపడంతో 11 గంటలకు ఆందోళన విరమించారు.

Updated Date - Jul 23 , 2025 | 01:09 AM