Share News

మన్యంపై మంచు దుప్పటి

ABN , Publish Date - Nov 09 , 2025 | 10:49 PM

మన్యంలో ఆదివారం ఉదయం పొగమంచు దట్టంగా కమ్మేసింది. శీతాకాల వాతావరణం నెలకొనడంతో పొగమంచు కుమ్మేసింది.

మన్యంపై మంచు దుప్పటి
పాడేరు- జి.మాడుగుల మార్గంలో ఆదివారం ఉదయం కమ్మేసిన పొగమంచు

ఉష్ణోగ్రతలు తగ్గుముఖం

పాడేరు, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): మన్యంలో ఆదివారం ఉదయం పొగమంచు దట్టంగా కమ్మేసింది. శీతాకాల వాతావరణం నెలకొనడంతో పొగమంచు కుమ్మేసింది. దీంతో జిల్లా కేంద్రం పాడేరులో తెల్లవారుజాము నుంచి ఎనిమిది గంటల వరకు ఎదుట వ్యక్తులు కన్పించలేదు. తాజా వాతావరణం పర్యాటకులకు ఆహ్లాదకరంగా ఉంది. అలాగే వంజంగి, తాజంగి సందర్శనకు వచ్చే పర్యాటకులను విశేషంగా ఆకట్టుకున్నది.

తగ్గుముఖం పడుతున్న ఉష్ణోగ్రతలు

వాతావరణంలోని మార్పులతో మన్యంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. జి.మాడుగులలో ఆదివారం 11.6 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. ముంచంగిపుట్టులో 12.7, డుంబ్రిగుడలో 13.7, అనంతగిరిలో 14.1, పాడేరులో 14.6, పెదబయలులో 14.7, హుకుంపేటలో 14.9, చింతపల్లిలో 16.8, కొయ్యూరులో 18 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - Nov 09 , 2025 | 10:49 PM