కాపు సంక్షేమానికి పెద్దపీట
ABN , Publish Date - May 29 , 2025 | 11:51 PM
రాష్ట్రంలో కాపు సంక్షేమానికి టీడీపీ పెద్దపీట వేస్తోందని డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ తెలిపారు. గురువారం కడపలో జరుగుతున్న మహానాడు వేదికపై కాపు సంక్షేమంపై ఆయన ప్రసంగించారు.
డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ
తుమ్మపాల, మే 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాపు సంక్షేమానికి టీడీపీ పెద్దపీట వేస్తోందని డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ తెలిపారు. గురువారం కడపలో జరుగుతున్న మహానాడు వేదికపై కాపు సంక్షేమంపై ఆయన ప్రసంగించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కాపు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని 2014-2019లో కాపు కార్పొరేషన్కు సుమారు రూ.వెయ్యి కోట్ల నిధులు కేటాయించారన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో 47 వేల మంది కాపు కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తులు చేసుకుంటే ఏ ఒక్కరికి రూపాయి కూడా మంజూరు చేయకుండా కాపులను నట్టేట ముంచారని విమర్శించారు. కాపులపై మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కాపు కార్పొరేషన్కు రూ.15 వేల కోట్లు బడ్జెట్లో కేటాయించిందన్నారు.